News

అయ్యప్పమాలతో స్కూల్‌కు వెళ్ళినందుకు అభ్యంతరం!

197views

ఆత్మకూరు: అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని డిపాల్ పాఠశాల ఫాదర్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలివి. ఏడో తరగతి చదువుతున్న ఆంజనేయ రెడ్డి బుధవారం అయ్యప్ప మాల ధరించి బడికి వెళ్ళాడు. మాల తీసివేసి, బూట్లు ధరించి వస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని లేదంటే వెళ్ళిపోవాలని ఫాదర్ ఆనంద్ స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థి చెప్పాడు. పాఠశాల యాజమాన్యం తీరు నిరసిస్తూ అతని తల్లిదండ్రులు, అయ్యప్ప స్వామి మాలదారులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బడి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. మాల వేసుకుని బడికి రాకూడదని నిబంధనలు ఉన్నాయని ఫాదర్ చెప్పారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని వీహెచ్పీ సభ్యులు కోరారు. కాసేపటి తర్వాత విద్యార్థి మాల వేసుకుని పాఠశాలకు వచ్చేందుకు ఫాదర్ అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి