
346views
కడప: కడప నగరంలోని మృత్యుంజయ కుంట కాలనీకి చెందిన మైనర్ బాలికను షేక్ నూర్ బాషా అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇందుకు ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులను దిశా పోలీసులు అరెస్టు చేశారు. షేక్ నూర్ బాషా, తల్లి షేక్ నజ్మా, తండ్రి షేక్ చాంద్లపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు షేక్ నూర్ బాషా పరార్లో ఉన్నాడని, గాలిస్తున్నామని దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు.





