
355views
హర్యానా: సుమారు వందేళ్ళ తర్వాత బాబర్పూర్ను తిరిగి గురునానక్ నగర్గా పేరు మారుస్తూ హర్యాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బాబర్పూర్ అనేది అత్యంత పవిత్ర స్థలమైన పానిపట్ జిల్లాలో ఉంది. దీంతో ఎప్పటి నుంచో, ఇక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు బాబర్పూర్ను గురునానక్ నగర్గా మారుస్తూ హర్యానా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి స్వయంగా పానిపట్లోని గురుద్వారాకు వెళ్ళి , అక్కడి సిక్కులతో చర్చించి, తర్వాత ఈ నిర్ణయాన్ని వెలువరించడం విశేషం.





