
పూణే: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్య తర్వాత ఈ సంస్థ మద్దతుదారులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ప్రదర్శనలో అభ్యంతరకర నినాదాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమతి లేకుండా ప్రదర్శన చేసినందుకు 60-70 మందిపై కేసు నమోదు చేశారు.
#WATCH | Maharashtra: ‘Pakistan Zindabad’ slogans were heard outside the District Collector's office yesterday in Pune City where PFI cadres gathered against the recent ED-CBI-Police raids against their outfit. Some cadres were detained by Police; they were arrested this morning. pic.twitter.com/XWEx2utZZm
— ANI (@ANI) September 24, 2022
పూణేలో నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి, ఇందులో కొంతమంది ‘అల్లాహు అక్బర్’ అలాగే ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు, అతని పేరు రియాజ్ సయ్యద్.
Source: pyara hindustan





