News

మన్యంలో విధ్వంసానికి మావోయిస్టుల యత్నం

149views

విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసభల్లేరులో ల్యాండ్​మైన్స్ కలకలం రేపాయి. వలసభల్లేరు, వలసగూడ మధ్యలో గురువారం నెంబర్ 2 మైల్ స్టోన్ వద్ద 40 కేజీల రెండు స్టీల్ క్యాన్లలో ల్యాండ్​మైన్లను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబులను బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సాధారణ తనిఖీల్లో ఈ మైన్స్ బయటపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి