
87views
-
తాజాగా రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం
ముంబయి: ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 1,725 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. లికోరస్ అనే మొక్కలకు హెరాయిన్ కోటింగ్ వేసి డ్రగ్స్ తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు భిన్నమార్గాలను పాటించి డ్రగ్స్ తరలిస్తున్నారనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని చెప్పారు.