
న్యూఢిల్లీ: ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగం డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా ఛానెల్ లే అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు . వాస్తవాలను తెలపడం, సత్యాలను చూపించడం, అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి వేదికను అందించడమే నిజమైన జర్నలిజం అని ఆయన పేర్కొన్నారు.
ఆసియా-పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ (ఎఐబిడి) 47వ వార్షిక సమావేశం, 20వ సభలను ప్రారంభిస్తూ విభజన వాదం, తప్పుడు కథనాలను వ్యాప్తి చేసే అతిథులను ఆహ్వానించడం, వారి ఊపిరితిత్లు పగిలేట్టు కేకలు వేయడం ఛానెల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
“అతిథి, స్వరం, దృశ్యాలకు సంబంధించి మీ నిర్ణయాలు, విశ్వసనీయమైన, పారదర్శకమైన వార్తలు ప్రేక్షకుల దృష్టిలో మీ ఛానల్ విశ్వసనీయతను నిర్వచిస్తాయి. మీ కార్యక్రమాన్ని చూడటానికి వీక్షకుడు ఒక్క నిమిషం ఆగిపోవచ్చు, కానీ మీ యాంకర్ను, మీ ఛానెల్నూ లేదా మీ బ్రాండ్ను ఎప్పటికీ విశ్వసించరు” అని ఆయన హెచ్చరించారు.
కథనాన్ని సౌండ్ బైట్ల ద్వారా నిర్వచించ చూడవద్దని, అతిథులు, ఛానెల్ స్థాయిని పెంచే విధంగా మీరే నిబంధనలను రూపొందించుకొని, మీరే పునర్నిర్వచించండి అని మంత్రి ఈ సందర్భంగా హాజరైన ప్రసార దారులకు హితవు చెప్పారు.
Source: Nijamtoday





