News

విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు

218views

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌ప‌ట్నంలో గోమాత‌ల‌ను ఓ వ్యాన్‌లో క‌బేళాకు త‌ర‌లిస్తుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు డీసీపీ నాగ‌న్న మీడియాకు వెల్ల‌డించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్ద‌రిని విచారిస్తున్నారు. జూ ద‌రి తుప్ప‌ల్లో వ్యాన్‌ను పెట్టి, ఆవులను అందులోకి ఎక్కిస్తుండ‌గా ప‌ట్టుకున్నామ‌ని, కేసు న‌మోదు చేశామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి