దళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హత్య! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్

లఖింపూర్: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారం… అనంతరం హత్యకు గురయ్యారు. ఈ ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్ళు. వీరి మృతదేహాలను చెట్టుకు వేలాడుతూ స్థానికులకు కనిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఆరుగురు నిందితుల అరెస్టు
ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులు సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆరుగురు కలిపి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్ళి చేసుకోవాలని బాధితురాళ్ళు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ళ మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.
#LakhimpurKheri | UP Dalit Sisters' Rape-Murder: 6 Arrested, One Was Caught In Encounter https://t.co/I5jgWH4nwW
NDTV's Alok Pandey speaks to Lakhimpur SP Sanjeev Suman pic.twitter.com/ulJbMulUwL
— NDTV (@ndtv) September 15, 2022
పట్టపగలే కిడ్నాప్ చేసి…
అనుమానం రాకుండా ఉండేందుకే ఇద్దరు అక్కాచెల్లెళ్ళను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారని వారి తల్లి చెప్పింది. అయితే, తమ పిల్లలను నిందితులు.. అత్యాచారం చేసి హత్య చేశారని, అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆరోపించింది. ఇదిలా వుండగా, పోలీసులు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ళ తండ్రి విలపిస్తున్నాడు.
Source: Ritam/NDTV/EtvBharat





