
పాలము: జార్ఖండ్లోని పాలము జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కనీసం 50 హిందూ ఎస్సీ (మహాదళిత్) కుటుంబాలపై ఆ ప్రాంతంలోని ముస్లింలు దాడి చేశారు. అంతేకాదు… వారిని ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు.
ముషార్ కమ్యూనిటీకి చెందిన హిందువులు, ప్రభుత్వం వారికి ఇచ్చిన భూమిలో మారుమాటు గ్రామంలో నివసిస్తున్నారు. ఒక ముస్లిం గుంపు తమ ఇళ్ళను కూల్చివేసిందని, వస్తువులను ఛతర్పూర్లోని ఒక గ్రామానికి బలవంతంగా తరలించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టోంగ్రీ పహాడీ ప్రాంతంలోని తమ గుడిసెలలో నివాసముంటున్నామని, సోమవారం నిరాశ్రయులయ్యామని నంద్లాల్ ముసాహర్, రాధాదేవి మీడియాకు తెలిపారు.
కాగా, ఎస్సీ(షెడ్యూల్డ్ కులాలు) వర్గానికి చెందిన డజను మంది పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో దళిత కుటుంబాలకు భోజనం, దుస్తులు అందించి అదే గ్రామంలో పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. హిందువుల ఇళ్ళు కూల్చివేయబడ్డాయని నిర్ధారించిన పోలీసులు తగిన భద్రతతో పునరావాసం కల్పిస్తామని చెప్పారు.
Source: HINDU POST





