![](https://vskandhra.org/wp-content/uploads/2022/08/pak.jpg)
260views
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఒక మెసేజ్ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.