
405views
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు. ఈ ట్రైన్ ట్రయల్ రన్ ను నేడు రైల్వే శాఖ నిర్వహించింది. ప్రజలు ఆ రైలును ఆసక్తిగా తిలకించడం కనిపించింది.





