
148views
రోజురోజుకూ చైనా ఆగడాలు శృతి మించుతున్నాయ్. చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటితోనూ గిల్లి కజ్జాలకు దిగుతోంది. కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ధన, ఆయుధ బలంతో అందరినీ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా నిఘానౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ నౌకను శ్రీలంకలోని హంబన్ టొట రేవులో లంగర్ వేసేందుకు అనుమతి ఇవ్వడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడం లేదు. ఈ నౌక భారత్లో 750KM దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. దీని సాయంతో భారత క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే ఉంది. ఇప్పుడిక మన సైనికాధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.