248
ముంబై: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్ భండార్కర్ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్ తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ కశ్మీరీ గాయకురాలి జీవితం ఆధారంగా ఈ ఇది పట్టాలెక్కనుంది. నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా తెరకెక్కించనున్నట్టు సమాచారం. మరోవైపు కంగనా ‘ఎమర్జెన్సీ’ షూటింగ్తో బిజీగా ఉన్నారు. అందులో తను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.