News

అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం!

416views

అసొం: అసొంలోని హైలకండిలో ఓ బాలిక‌పై ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుల‌ను అబుల్ హుస్సేన్, సలీం ఉద్దీన్‌లుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు.

హైలకండి జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఈ నెల 15న రామ్‌నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచియాల గ్రామంలో జరిగింది.

కంచియాల గ్రామంలోని అటవీ ప్రాంతంలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని హైలకండి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ ఉపాధ్యాయ తెలిపారు.

“ఈ ప్రాంతమంతా చాలా మారుమూల అటవీ ప్రాంతం. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. సీనియర్ అధికారులందరూ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి (జూలై 20), నిందితులిద్దరినీ అరెస్టు చేసాం… ఇద్దరూ బాధితుడి గ్రామానికి చెందినవారు”అని ఉపాధ్యాయ్ చెప్పారు.

అంతకుముందు జూన్‌లో, హోజాయ్ జిల్లాలో ఇదే విధమైన సంఘటన జ‌రిగింది. ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తులు ముక్తార్ హుస్సేన్, అజీజుర్ రెహమాన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి