News

సరిహద్దుల్లో హెలికాప్టర్ల చక్కర్లు.. పాక్​ పనేనా?

392views

బాడ్​మేర్​: రాజ‌స్తాన్‌​ బాడ్​మేర్​ జిల్లాలోని పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. హెలికాప్టర్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాడ్​మేర్​ జిల్లాలోని సందాని పట్టణం లూనీ నదీ ప్రాంతంలో ఈ చాపర్లు ల్యాండ్​ అయి.. ఆ వెంటనే గాల్లోకి ఎగిరినట్టు తెలుస్తోంది. అయితే.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చెందినవి అనే విషయంపై స్పష్టత లేదు. హెలికాప్టర్లు భద్రతా దళాలకు చెందినవా, మరెవరివైనా అయి ఉంటాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు బాడ్​మేర్​ జిల్లా అడిషనల్​ ఎస్పీ నర్పత్​ సింగ్​ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి