News

చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి!

245views

నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఓ చర్చిపై ఆదివారం కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు.

మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి