News

బాలికకు కృత్రిమ కాలు అమరిక

531views

బీహార్‌లోని జుముయ్‌ జిల్లాకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. రెండేళ్ల క్రితం సీమాకు ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. అయితే తన వైకల్యానికి ఆమె కృంగిపోలేదు. ఏడాదిలో పూర్తిగా కోలుకొని బలంగా నిలబడింది. ఒంటికాలితోనే కిలోమీటరు దూరంలో ఉన్న స్కూలుకు ప్రతిరోజూ వెళ్లేది. అయితే ఆమె పాఠశాలకు వెళుతున్న దృశ్యాలను కొద్దిరోజుల క్రితం కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా విశేష స్పందన వచ్చింది. అనేకమంది ఆమెను ప్రశంసించారు. ఆమె మనోధైర్యం, చదువుకునేందుకు ఆమె చూపిస్తున్న ఆసక్తి పట్ల ముగ్ధులయ్యారు. ప్రముఖులు, అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

సీమాపై వచ్చిన కథనాలపై వైద్య శాఖ స్పందించింది. వైద్యశాఖ అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. వైద్యసిబ్బంది ఆమెకు సరిపడేలా ఒక కృత్రిమ కాలును రూపొందించి అమర్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.