News

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు

580views

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు.

నివేదికల ప్రకారం, మసీదు సమీపంలో కొత్త హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించారు. ఆ తర్వాత రెండు వర్గాల ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జరిగింది. త‌ర్వాత‌ తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడం ప్రారంభించారు. అనేక వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు దహనం ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పరిస్థితిని నియంత్రించడానికి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు పోలీసులు అమలు చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కాగా, మ‌ధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన మత ఘర్షణలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నీచ రాజకీయాలు ఆడేందుకు ఉపయోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖార్గోన్ హింసాకాండ తర్వాత నకిలీ ట్వీట్‌ను పంచుకోవడం ద్వారా భయం, హిస్టీరియాను వ్యాప్తి చేసినందుకు మల్టిపుల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కించపరిచేందుకు పైన పేర్కొన్న సంఘటనను మంగళవారం మరోసారి ట్విట్టర్‌లోకి తీసుకున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి