
537views
న్యూఢిల్లీ: పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ అభివృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం సహా అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. క్రిస్టలినా మాట్లాడుతూ, భారత దేశం మంచి లక్ష్యంతో కూడిన విధానాలను అమలు చేస్తోందని, దీనివల్ల పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడటానికి అవకాశం కలిగిందని తెలిపారు.
Source: Nijamtoday





