
న్యూఢిల్లీ: గత ఏడాది సియాల్కోట్లో తప్పుడు దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక పౌరుడు ప్రియాంత కుమారను కొంతమంది మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆరుగురు ప్రధాన నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది.
సోమవారం, ఏప్రిల్ 18, ట్రయల్ కోర్టు తొమ్మిది మందికి జీవిత ఖైదు, ఒకరికి ఐదేళ్ల జైలు, 72 మందికి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే, ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసినట్టు పంజాబ్ ప్రాసిక్యూషన్ విభాగం కార్యదర్శి నదీమ్ సర్వర్ లాహోర్లోని విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ప్రియాంత అనే 49 ఏళ్ళ శ్రీలంక జాతీయుడు అతను మేనేజర్గా పనిచేస్తున్న ఫ్యాక్టరీలో డిసెంబర్ 3, 2021న కార్మికుల గుంపు చేత హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్లో గత 15-16 ఏళ్ళలో సియాల్కోట్లో జరిగిన ఘటన రెండోది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై జరిగిన దాడితో పాక్ అధికారులు అప్పట్లో కంగుతిన్నారు.
Source: Organiser





