
న్యూఢిల్లీ: నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డెన్మార్క్ ఓపెన్- 2022లో స్విమ్మింగ్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వేదాంత్ 800 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్లో 8:17.28 నిమిషాలతో పతకాన్ని గెలుచుకున్నాడు. మాధవన్ తన కుమారుడు ప్రైజ్ అందుకున్న క్లిప్ను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు.
டென்மார்க்கில் நடைபெற்ற நீச்சல் போட்டியில் நடிகர் மாதவனின் மகன் தங்கப்பதக்கம் வென்று சாதனை #Denmark #SwimmingCompetition #ActorMadhavan #GoldMedal #VedaantMadhavan pic.twitter.com/YS4fitYunO
— Polimer News (@polimernews) April 18, 2022
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో క్లిప్ను షేర్ చేస్తూ, “గోల్డ్….మీ అందరి దీవెనలతో, దేవుని ఆశీస్సులతో విజేతగా నిలిచాడు. ఈరోజు వేదాంత్మాధవన్కి ఇది 800 మీటర్ల స్విమ్మింగ్లో బంగారు పతకం. ఇది నన్ను ఎంతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. ఆనందంతో తన్మయత్వం చెందేలా చేస్తోంది” అని మాధవన్ పోస్టు పెట్టారు.
శనివారం అదే స్విమ్మింగ్ ఈవెంట్లో వేరే విభాగంలో మాధవన్ కుమారుడు రజత పతకాన్ని సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో పతకాన్ని గెలుచుకున్నాడు. 15:57:86 నిమిషాలలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. “కోపెన్హాగన్లో జరిగిన డానిష్ ఓపెన్లో వేదాంత్ మాధవన్ భారతదేశానికి రజతం అందించాడు. మాకు చాలా గర్వంగా ఉంది.” అని మాధవన్ పోస్ట్ పెట్టారు. మాధవన్ కుమారుడు వేదాంత్ అనేక అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





