News

క‌శ్మీర్‌లో సర్పంచ్‌ని కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు!

476views

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్​బుఘ్​లో ఓ సర్పంచ్​పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అత‌డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్ అహ్మద్ అని పోలీసులు వెల్లడించారు. అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి