
-
సంచలన విషయాలను వెల్లడించిన మాజీ భార్య కుటుంబం
లక్నో: గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడైన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని ఆయన మాజీ భార్య పేర్కొంది. 2019లో పెళ్లి జరిగిన వెంటనే, ఆమె అత్తగారింట్లో గృహ హింసను ఎదుర్కొంది. అందుకే మేము ఆమెను తిరిగి తీసుకువచ్చారని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పోలీస్ రిమాండ్లో ఉన్న అబ్బాసీ 2019లో షద్మాను వివాహం చేసుకున్నాడు. తాను అబ్బాసీతో కలిసి జీవించిన కాలంలో అతను తనతో చాలా అరుదుగా మాట్లాడేవాడని ఆమె పేర్కొంది. భర్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ను ఎప్పుడూ ముట్టుకోలేకపోయానని, వాటిని అతడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని ఆమె ఆరోపించింది. అతను ఆ సమయంలో ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆమెకు తెలియదు.
అబ్బాసీ మాజీ మామ ముజఫరుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు 2019లో అబ్బాసీతో వివాహం జరిగిన వెంటనే, గృహ హింస ఘటనలు చోటుచేసుకోవడంతో కొన్ని నెలల తర్వాత మేము ఆమెను తిరిగి తీసుకువచ్చాము. అతను ఫోన్లో తలాఖ్ చెప్పాడు.. అప్పటి నుండి, అతనితో మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది” అని ముజఫరుల్ హక్ అన్నారు. ముజఫరుల్ హక్ టైమ్స్ నౌ కు మాట్లాడుతూ అతను పూర్తిగా సాధారణంగా ఉన్నాడని, తన కుమార్తెతో వివాహం చేసుకున్నప్పుడు మానసిక సమస్యల సంకేతాలు కనిపించలేదని చెప్పాడు.
Source: NationalistHub





