
621views
శ్రీశైలం: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. బుధవారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. రాజగోపురం నుంచి గంగాధర మంటపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముంగిట సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
భ్రమరాంబదేవి మహలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి పైరెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపు అభయహస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు. ఈ మహలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వలన శత్రుబాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.





