
676views
విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న “ది కశ్మీర్ ఫైల్స్” మూవీ ఓటీటీ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ చలనచిత్రం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరిగిన దారుణ మారణ కాండను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి హృద్యంగా తెరకెక్కించారు. చిత్రం థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. అయితే సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా మరికొంతకాలం థియేటర్లలోనే ఉంచి, మే 6న ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.





