News

పూణే మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

434views

పూణే: మహారాష్ట్రలోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రోలో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది.

గర్వారే మెట్రో స్టేషన్లో జెండా ఊపి రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని టికెట్ కొనుక్కుని మరీ మెట్రోలో ప్రయాణించారు. గ‌ర్వారే మెట్రో స్టేష‌న్ నుంచి ఆనంద్ న‌గ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు ప్రయాణికులతో కలిసి వెళ్ళారు. మెట్రో రైలు రాక‌తో పుణెలో అర్బ‌న్ మొబిలిటీ కోసం అంత‌ర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లయింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి