
436views
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్కాల్లో ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండటంపై ఉక్రెయిన్ను మోదీ అభినందించారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్ తన సహకారాన్ని అందించాలని ప్రధాని కోరారు.
Source: EtvBharat





