News

మావోయిస్టు సానుభూతిపరుల విద్రోహ కుట్ర

593views
  • జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం

  • కర్నూలులో అధికారుల సోదాలు

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో మావోయిస్టుల విద్రోహ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భగ్నం చేసింది. ఈ మేరకు కర్నూలులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నేత పినాకపాణికి ఉదయం 10 గంటలకు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు రావాలంటూ ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ఠాణాలోనే ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టనున్నారు. గతంలోనూ పినాకపాణి నివాసంలో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సోదాల్లో కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లలను వారు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి