
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ మంగళవారం నాటికి 100 లక్షల మంది సబ్స్క్రైబర్లను దాటింది. గూగుల్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో ఆయనను ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరిగా నిలిచారు.
2007 అక్టోబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘నరేంద్రమోదీ’ ఛానల్ సృష్టించారు. ఛానెల్లోని కొన్ని ప్రసిద్ధ వీడియోలలో నటుడు అక్షయ్ కుమార్తో ఆయన ఇంటర్వ్యూ, 2019లో హిందీ చిత్ర పరిశ్రమ సభ్యులతో మోదీ చర్చించడం, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై వీడియో ఉన్నాయి. ఈ ఛానెల్తో పాటు, యూట్యూబ్లో ప్రధానికి అధికారిక పీఎంవో ఇండియా ఛానెల్ కూడా ఉంది. దీని ద్వారా దేశానికి వివిధ అధికారిక ప్రకటనలు, ప్రధాని ప్రసంగాలు అందించబడతాయి.
Source: NationalistHub





