
-
రోడ్డు నిర్మాణంతో తలెత్తిన వివాదం
-
ఈశాన్య భారతంలో కొలిక్కిరాని సరిహద్దు వివాదాలు
అసొం: ఈశాన్య భారత్లో సరిహద్దు వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఈ ఘటనలపై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అసోం, అరుణాచల్ప్రదేశ్ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలో తలెత్తిన వివాదంలో కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.
అసోం, ధెమాజీ జిల్లా గోగాముఖ్ ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో వివాదస్పద భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు కాంట్రాక్టర్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జనవరి 24న చర్చలు జరిగిన రెండో రోజే సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై వివాదం చెలరేగటం ఆందోళనలు పెంచుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు సమావేశమై చర్చించారు.





