
684views
జమ్ముకశ్మీర్: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వీడియో అప్లోడ్ చేసిన కేసులో జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాకు చెందిన ముస్లీం తండ్రీకొడుకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ మద్దతుదారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చింగాస్ ప్రాంతానికి చెందిన నిందితులు.. మోదీపై అభ్యంతరకర టిక్టాక్ వీడియోని ఫేస్బుక్లో అప్లోడ్ చేసినట్టు బీజేపీ మద్దతుదారులు ఆరోపించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





