News

తిరుచానూరులో మూడోరోజు నవకుండాత్మక శ్రీ‌యాగం

549views

తిరుచానూరు: ప్రపంచశాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవకుండాత్మక శ్రీ‌యాగం ఆదివారం మూడో రోజు కొనసాగుతోంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చకులు శ్రీ వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి.

ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి మ‌ధ్యాహ్నం వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేద‌న‌, హారతి, వేద విన్న‌పం నిర్వ‌హించారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి