
-
అత్యాచారం, వీడియో చిత్రీకరణ, బ్లాక్ మెయిల్
-
నిందితులను అరెస్టు చేసిన ముంబై పోలీసులు
ముంబై: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఓ ముస్లిం జంట ఓ మహిళపై ఘోరానికి పాల్పడింది. అక్కడి న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఓ హోటల్లో సయ్యద్ యూసుఫ్ జమాల్, నాజ్ సయ్యద్ అనే జంటను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ యూసుఫ్ జమాల్పై.. మహిళపై అత్యాచారం, బ్లాక్మెయిల్ అభియోగాలు నమోదయ్యాయి. అతని భార్య నాజ్ సయ్యద్ ఈ సంఘటనను చిత్రీకరించిందని, బాధితురాలి నుండి డబ్బు వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
కోల్కతా పోలీసుల సహాయంతో, ముంబై పోలీసులు హోటల్లో నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, వారు చిత్రీకరించిన కొన్ని వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. సిటీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత, జంటను ట్రాన్సిట్ రిమాండ్పై ముంబైకి తీసుకువచ్చారు. బాధితురాలు ముంబైలోని నాగ్పరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యూసుఫ్ తన భార్య నాజ్ ఎదుటే తనపై అత్యాచారానికి పాల్పడేవాడని, ఆ ఘటనను నాజ్ వీడియోలో రికార్డు చేసిందని బాధితురాలు పేర్కొంది.
Source: NationalistHub





