
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం వ్యక్తం చేశారు.
‘చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది యువతకు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గురించి బాగా తెలుసు. ఆయనను ఎలా గౌరవించాలో కూడా తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు. దేశం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్కు ఇండియా గేట్ వంటి ప్రముఖమైన చోట విగ్రహం ఏర్పాటు చేయడం ఘన నివాళి అవుతుంది’ అని అనితా సుభాష్ ఓ ట్వీట్లో తన సంతోషాన్ని పంచుకున్నారు.
నేతాజీ పాటించిన విలువలు, సిద్ధాంతాలను పునరుద్ధరించి, పటిష్ఠం చేయడం అన్నిటికంటే ముఖ్యమని ఆమె చెప్పారు. ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా ప్రతి ఒక్క యువతీయువకుడు బోస్ ఆశయాల కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని ఆమె పేర్కొన్నారు.
Source: Nijamtoday





