News

హిందు దేవ‌తా విగ్ర‌హాలు అప‌విత్రం.. నిందితుడి అరెస్టు

676views

మైసూరు: కర్ణాటక, మైసూరు జిల్లాలోని సాలిగ్రామ గ్రామంలో పదేపదే హిందూ దేవతల మూర్తిలను పగలగొట్టి ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడోతేదీన శ్రీ సిద్ధలింగేశ్వర, మహదేశ్వర ఆలయాల‌ తలుపులు పగులగొట్టి, లోప‌ల ఉన్న శివ‌లింగాల‌ను ధ్వంసం చేశాడు. ‘రాళ్ల విగ్రహాలను’ పూజించడం వల్ల ప్రజలు మోసపోతున్నారని భావించి తాను మూర్తిలను పగలగొడుతున్నట్టు నిందితుడు పోలీసుల విచార‌ణ‌లో చెప్పాడు. ‘భద్రతా కారణాల’ దృష్ట్యా అతని పేరు, ఇత‌ర వివ‌రాల‌ను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

నిందితుడు శ్రీ లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూల్చివేసి, మూర్తిని వికృతం చేసిన తర్వాత బావిలో పడేశాడు. ఈ ఘటన కేఆర్‌సీ పరిధిలో చోటుచేసుకుంది. ఇంకా, పెట్ రూరల్ పోలీస్ స్టేషన్, బీరవల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ దేవాలయంలోకి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లబోతుండగా, ప్రజలు రావడంతో పారిపోయానని పోలీసులకు తెలిపాడు. నిందితుడు ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి చాలా కాలంగా హిందూ దేవతల మూర్తులను పగలగొట్టడం అలవాటు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి