News

సరస్వతీ నదిపై పరిశోధనలు

700views

ప్రయాగ్‌రాజ్‌: పవిత్ర సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ళ‌ క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని, భూ గర్భంలో సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన జలవనరుల నిపుణులు అప్పట్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.మీ వరకు (హిమాలయాల వైపు) సరస్వతి నది ఆనవాళ్ళు ఉన్నట్టు గుర్తించారు. నాలుగు కి.మీ. వెడల్పున, 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు.

గంగ, యమున నదుల నీటికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సరస్వతి నది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ జర్నల్‌ ప్రచురించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి