294
ఒసాకా: జపాన్లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్ బ్రాడ్కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై మార్కెట్లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారని, వారిలో 27 మంది గుండె ఆగిపోవడంతో మరణించారని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరగంటలో భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయి.
Source: Tv9