371
న్యూఢిల్లీ: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసెంబ్లీలో చర్చ పొడిగించాలనే ఎమ్మెల్యేల ఒత్తిడితో సభను అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంగా మారింది. ‘నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ ఆస్వాదిస్తూ ‘అవును’, ‘అవును’ అంటూ ఉండాలి. అంతే’ అని స్పీకర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలని.. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని అన్నారు.