
607views
కశ్మీర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని రాంభాగ్లో బుధవారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
Source: EtvBharat





