News

హైపవర్ పోలీసింగ్ మిషన్ ఏర్పాటుకు మోదీ పిలుపు

587views
  • అమిత్ షా నేతృత్వం

న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు. పోలీస్​ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొన్ని సంఘటనలను విశ్లేషించి కేస్ స్టడీలను రూపొందించాలని కోరారు.

కొవిన్​, జెమ్​ పోర్టల్​, యూపీఐ పేమెంట్స్​ దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్-ఒపేరబుల్​ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని సూచించారు. కరోనా తరువాత పోలీసుల వైఖరిలో సానుకూల మార్పును ప్రశంసించారు. ప్రజల ప్రయోజనం కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని.. స్మార్ట్ పోలీసింగ్ కాన్సెప్ట్​ను సమీక్షించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.