News

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

355views

న్యూఢిల్లీ: ఆసియా మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభపడి 60 వేల పాయింట్ల ఎగువునకు చేరింది. అటు నిప్టీ కూడా 125 పాయింట్లకు పైగా లాభపడి 18వేల పాయింట్ల ఎగువునకు చేరింది. ఉదయం 9.45 గం.లకు సెన్సెక్స్‌ 397 పాయింట్ల లాభంతో 60,317 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించగా.. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 17,998 పాయింట్ల వద్ద ట్రేడిరగ్‌ అవుతోంది. టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌ మహీంద్ర, హిండాల్కో, ఎస్బీఐ, గ్రాసిమ్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, రియాల్టీ, ఐటీ తదితర దాదాపు అన్నీ రంగాల షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి