
-
కరోనా కారణంగా మందగించిన అమలు
-
యూజీసీ చైర్మన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత్లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, ఎన్ఈపీని సరైన సమయంలోనే తీసుకొచ్చారని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లతో కేంద్రం చర్చలు జరుపుతుందని ధీరేంద్రసింగ్ తెలిపారు.
ఎన్ఈపీలోని కొన్ని కార్యకలాపాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయన్నారు. 2022 జులై నుంచి దేశవ్యాప్తంగా ఈ పాలనీని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతుందని తెలిపారు. విద్యార్థులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించటమే కాక.. ప్రపంచంలోనే ఉత్తమ పౌరులుగా విద్యార్థులను జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) తీర్చిదిద్దుతుందన్నారు.





