
699views
-
నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు
-
పోలీసులకు మొదటి భార్య ఫిర్యాదు
నల్గొండ: పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ వేశాడు ఆ చర్చిలోని కళాకారుడు. ఏపీలోని నల్గొండ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే యువతులు, మహిళలను లోబర్చుకున్నాడు. ఇలా… 19 మందిని మోసం చేశాడు. ఈ బాగోతంపై విలియమ్స్ మొదటి భార్య తనూజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మోసగాడి అసలు సంగతి బయటకు పొక్కింది. అయితే, ఫిర్యాదు విషయం తెలుసుకున్న విలియమ్స్ గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
Source: Eenadu





