
737views
సమరసతా వేదిక, విజయవాడ వారిచే ఏర్పాటు చేయబడిన భరతమాత, మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలామ్, సంత్ గాడ్గే బాబా, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణ పంతులు గార్ల విగ్రహాలను గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విజయవాడ రామమోహన్ లైబ్రరీలో ఆవిష్కరించారు.


అనంతరం ఈ అన్ని విగ్రహాలకు రజక సంఘం అధ్యక్షులు శ్రీ పార్ధసారధి, డాక్టర్ రవీంద్రనాద్, సమరసతా వేదిక విజయవాడ అధ్యక్షులు , కార్యదర్శి శ్రీ రాము, SSF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విష్ణువు మరియు కమిటీ సభ్యులు పూల మాలలు సమర్పించారు.





