News

ఇటలీ ప్రధానితో మోడీ చర్చలు

646views

ఇట‌లీ: ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాన మంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటన మోడీ చేపట్టారు. శనివారం ఉదయం ఇటలీ చేరుకున్న ఆయనకు రోమ్​లోని ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయం ప్లాజో చిగిలో డ్రాగి స్వాగతం పలికారు. అక్కడ మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్​ వేదికగా తెలిపారు. జీ20 సమావేశం అనంతరం బ్రిటన్​లోని గ్లాస్గోలో జరగనున్న కాప్26 ప్రపంచ నేతల సదస్సులోనూ మోదీ పాల్గొనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి