
556views
-
మండిపడ్డ భారత్
ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్కు సమీపంలో, టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్ నిర్మించేందుకు చైనా వేసిన ప్రణాళికలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనులను చైనా పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న రహదారిగా అభివర్ణించింది.
6,009 మీటర్ల గరిష్ఠ లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన యార్లుంగ్ జాంగ్బో గ్రాండ్ లోయ వెంబడి.. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన రహదారి గత శనివారం పూర్తయినట్టు చైనా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. న్యిన్గ్చి, మెడాగ్ను జోడిస్తూ జరిగిన 67.22 కిలోమీటర్ల నిర్మాణంతో రహదారి పనులు ముగిసినట్టు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్కు సమీపంగా, టిబెట్లోని చివరి కౌంటి ఈ మెడాగ్ కావడం గమనార్హం.





