News

ప్రపంచ షూటింగ్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు

379views

పెరూ: పేరూలోని లిమా జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ అదిరే ప్రదర్శన చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే నాలుగు స్వర్ణాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో శరబ్‌జ్యోత్‌ సింగ్‌తో కలిసి విజేతగా నిలిచిన మను బాకర్‌.. రిథమ్‌, శిఖ నర్వాల్‌లతో కలిసి 10మీ ఎయిర్‌ పిస్టల్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌ పసిడిని సొంతం చేసుకుంది.

స్వర్ణ పోరులో భారత్‌ 16-12తో బెలారస్‌పై నెగ్గింది. పురుషుల ఎయిర్‌ పిస్టల్‌లో నవీన్‌, శరబ్‌, శివలతో కూడిన భారత జట్టు 6-14తో బెలారస్‌ త్రయాన్ని ఓడిరచి స్వర్ణాన్ని గెలుచుకుంది. పురుషుల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ జట్టు కూడా స్వర్ణం సాధించింది. ఈ జట్టులో హైదరాబాదీ షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ సభ్యుడు. మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌, మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత్‌కు రజతాలు దక్కాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి