
645views
బీజింగ్: ఆఫ్గాన్లో తాలిబన్ల ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్ డాలర్ల సాయాన్ని మానవత్వం పేరుతో ఉగ్రవాదులకు అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు అఫ్గాన్కు సరఫరా చేసింది. ఇవి బుధవారం రాత్రి.. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయని చైనా పేర్కొంది.





