News

‘BLEEDING INDIA’, ‘రక్తసిక్త భారతం’ పుస్తకాల ఆవిష్కరణ

675views

భాగ్యనగరం: భాగ్యనగరంలో నిన్న మంగళవారం ‘BLEEDING INDIA’తో పుస్తకంతో పాటు దాని తెలుగు అనువాదం ‘రక్త సిక్త భారతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ శ్రీ విద్యాసాగర్‌ రావు, భారతీయ మజ్దూర్‌ అఖిల భారత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.సురేంద్ర‌న్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత సహప్రచార ప్రముఖ్‌  నరేంద్ర ఠాకూర్‌, ‘BLEEDING INDIA’ పుస్తక రచయిత బినయ్‌ కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత బినయ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ’ఝార్ఖండ్‌లో ఒక ముస్లిం యువకుడు హిందూ గిరిజన మహిళను వివాహమాడిన తరువాత కూడా మతం మార్చలేదు’ అన్న వార్త ఆశ్చర్యం కలిగించిందనీ, ఆ విషయంపై పరిశోధన చేయగా బంగ్లాదేశ్‌ చోరబాటు దారులు దాదాపు పదివేల మంది ఇలా హిందూ గిరిజన స్త్రీలను వివాహం పేరున లోబరుచుకొని పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిపారని తెలిసిందన్నారు. ఈ పన్నాగం వెనుక PFI హస్తం ఉందనీ అర్థమైందన్నారు. ఈ విషయం సామాన్యులకు అర్థం కావలిసిన అవసరం గమనించి ఈ పుస్తకాన్ని రచించాననీ తెలిపారు.

సురేంద్రన్‌ మాట్లాడుతూ ’దళిత’ అనే పదాన్ని ‘దళిత వాయిస్‌’ అనే పేరు గల సంస్థ వ్యవస్థాపకుడు వి.టి రాజశేఖర్‌ అనే వ్యక్తి ప్రాచుర్యంలోకి తెచ్చారనీ, 1980 లలో షెడ్యూలు కులాలు అని కాకుండా దళిత అనే పదంతో దేశ విచ్ఛిన్నకర ఆలోచనలతో ఎలా హిందూ సమాజంలో అనైక్యత పెంచే ప్రయత్నం జరిగిందీ, ఇప్పుడు ఈ అనైక్యత వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రస్తావించారు.

ఈ పుస్తకాన్ని బర్కత్‌ పురాలోని కేశవ నిలయంలో పొందవచ్చు. ఆన్‌లైన్‌లో కింది లింక్‌ ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.

ర‌క్త‌సిక్త భార‌తం : https://www.hindueshop.com/product/rakta-sikta-bhaaratam/

BLEEDING INDIA : https://www.hindueshop.com/product/bleeding-india/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి